Vijaya Sai Reddy: శ్రీవారి మీద ప్ర‌మాణం చేస్తున్నా.. శాంతితో నా రిలేష‌న్‌షిప్ ఇదే

vijaya sai reddy says he does not have any illicit affair with anyone

Vijaya Sai Reddy: త‌న‌కు ఏ మ‌హిళ‌తోనూ అక్ర‌మ సంబంధం లేదని.. కావాలంటే వెంక‌టేశ్వ‌ర స్వామిపై ప్ర‌మాణం చేస్తాన‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య‌సాయి రెడ్డి వెల్లడించారు.

“” అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో కూడా చెప్తాను “” అని ట్వీట్ చేసారు.