Vijaya Sai Reddy: కుప్పంలో బాబు గ్రాఫ్ ప‌డిపోయింది.. అక్క‌డ పోటీ వేస్ట్

Vijaya Sai Reddy: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (Chandrababu Naidu) కంచుకోట అయిన కుప్పం ఇక ఏమాత్రం ఆయ‌న‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని అన్నారు YSRCP ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. కుప్పంలో బాబు గ్రాఫ్ ప‌డిపోతోంద‌ని.. 1999లో ఆయ‌న‌కు 74 శాతం మ‌ద్దతు ఉండ‌గా.. ఆ త‌ర్వాత 2004లో 70 శాతానికి.. 2019 నాటికి 55 శాతానికి గ్రాఫ్ ప‌డిపోయింద‌ని అన్నారు. తెలుగు దేశం పార్టీ కేవ‌లం మాట‌లే చెప్తుంద‌ని చేత‌ల్లో ఏమీ లేద‌న్న విష‌యం కుప్పం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింద‌ని.. ఇక్క‌డ YSRCP గెలుపు ఖాయ‌మ‌ని.. ఇక్క‌డి నుంచే ప్ర‌చారం మొద‌లుపెడతామ‌ని అన్నారు.