కొండా సురేఖ కోసం వేములవాడలో నైవేద్యాన్ని ఆపిన అధికారులు

vemulawada officials halt naivedyam for konda surekha

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఈరోజు సురేఖ త‌న భ‌ర్త‌తో క‌లిసి వేములవాడ రాజ‌న్న స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ నేప‌థ్యంలో స్వామి వారికి స‌మ‌ర్పించాల్సిన‌ నైవేద్యాన్ని అధికారులు నిలిపివేసారు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి మూడు గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉండగా.. 30 నిమిషాలు ఆలస్యంగా రాజన్న స్వామి వారికి నివేదన సమర్పించారు. స్వామి వారి నైవేద్యాన్ని ఆపి మ‌రీ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక పూజలు చేయించిన అధికారులపై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.