Varahi Yatra: రేప‌టి నుంచే ప‌వ‌న్ యాత్ర‌.. మీరూ పాల్గొంటారా?

AP: జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి విజ‌య యాత్ర (varahi yatra) రేప‌టి నుంచే ప్రారంభం కానుంది. అన్న‌వ‌రంలోని స‌త్య‌దేవుని ద‌ర్శ‌నం త‌ర్వాత ఈ యాత్ర ప్రారంభం కానుంది. తొలిద‌శ‌లో ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాలో 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర జ‌ర‌గ‌నుంది. ఈరోజు క‌త్తిపూడిలో స‌భ‌తో యాత్ర మొద‌ల‌వుతుంది. అయితే ఈ యాత్ర‌లో పాల్గొని ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేయాల‌నుకునే వారు వాలంటీర్లుగా ప‌నిచేయొచ్చ‌ని జ‌న‌సేన పిలుపునిచ్చింది. గ్రౌండ్ లెవెల్, ఐటీ, సోష‌ల్ మీడియా ద్వారా వాలంటీరింగ్ చేయాల‌నుకునేవారు ఈ కింద ఇచ్చిన నెంబ‌ర్‌కు ఫోన్ చేసి వారి వివ‌రాలు తెలియ‌జేయ‌చ్చు.