Vangalapudi Anitha: జ‌గ‌న్ మార‌డు.. ఆ 11 కూడా మిగ‌ల‌వు

vangalapudi anitha wants jagan to do dharna on his babai murder

Vangalapudi Anitha: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అబ‌ద్ధాలు చెప్ప‌డం వెన్న‌తో పెట్టిన విద్య అని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి వంగ‌లపూడి అనిత‌. అచ్యుతాపురం సెచ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్ట‌ర్ పేలి దాదాపు 17 మంది మృత్యువాత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న జ‌గ‌న్ మృతుల కుటుంబీకులను, క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్‌లో ప‌రామ‌ర్శించారు. ఆ తర్వాత జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. గ‌తంలో ఎల్జీ పాలిమ‌ర్స్ విష‌యంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే తాను అప్ప‌టిక‌ప్పుడు వెన్నంటే ఉండి బాధితుల‌ను ఆదుకున్నాన‌ని అదే మాదిరిగా చంద్ర‌బాబు నాయుడు ఆదుకోకపోతే తాను ధ‌ర్నాకు దిగుతాన‌ని అన్నారు.

దీనిపై అనిత స్పందిస్తూ.. ఎల్జీ పాలిమ‌ర్స్ పేలుడు ఘ‌ట‌న స‌మ‌యంలో ఆ కంపెనీ యాజ‌మాన్యాన్ని జ‌గ‌న్ ఎయిర్‌పోర్ట్‌లో క‌లిసి అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ని.. అలాంటి వ్య‌క్తి ఈరోజు ధ‌ర్నా చేస్తాన‌ని అంటుంటే న‌వ్వొస్తోంద‌ని అన్నారు. జ‌గ‌న్ ధ‌ర్నా చేయాల‌నుకుంటే బాబాయిని ఎవ‌రు చంపారో వారికి శిక్ష ప‌డాలి అనే విష‌యంపై చేయాలని అన్నారు. జ‌గ‌న్‌కు అబ‌ద్ధాలు ఆడ‌టం వెన్న‌తో పెట్టిన విద్య అని.. చ‌నిపోయిన వారి కుటుంబీకుల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను న‌వ్వుతూ ప‌ల‌క‌రించ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ ఇలాగే అబ‌ద్ధాలు ఆడుతూ ఉంటాడ‌ని.. ఇక అత‌నిలో మార్పు వ‌స్తుంద‌ని అనుకోవ‌డం కూడా పొర‌పాటే అని అన్నారు. ఇలాగే ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ 11 సీట్లు కూడా మిగ‌ల‌వ‌ని సెటైర్ వేసారు.