Vangalapudi Anitha: న‌గ‌రి పొమ్మంటోంది.. జ‌బ‌ర్ద‌స్త్ ర‌మ్మంటోంది

Vangalapudi Anitha: తెలుగు దేశం పార్టీ (TDP) పొలిట్ బ్యూరో స‌భ్యురాలు వంగ‌ల‌పూడి అనిత.. YSRCP మంత్రి రోజాపై (roja) తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) ఒక్క మాట‌న్నా.. ఆయ‌న భార్య భార‌తిని ఏమ‌న్నా కూడా ట‌క‌ట‌కా ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చిన‌ట్లు తిట్టే రోజా.. ఇప్పుడు పుత్తూరు 17వ వార్డు కౌన్సిల‌ర్ భువ‌నేశ్వ‌రి త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు స్పందించ‌డంలేదు అని ప్ర‌శ్నించారు. న‌గిరి రోజాను పొమ్మంటోంది.. జబ‌ర్ద‌స్త్ ర‌మ్మంటోంద‌ని సెటైర్లు వేసారు. తెలుగు దేశం నుంచి YSRCPలోకి వెళ్లడానికి రోజాకు రూ.కోటికి పైగా ముట్టాయ‌ని ఆరోప‌ణ‌లు చేసారు.