Vangalapudi Anitha: జ‌గ‌న్‌పై దేశ‌ద్రోహం కేసు పెట్టాలి

Vangalapudi Anitha demands sedition case against jagan mohan reddy

Vangalapudi Anitha: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాల‌ని డిమాండ్ చేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేక‌పోయార‌న్న కోపంతో జ‌గ‌న్ ప్ర‌జ‌ల ప్రాణాలు తీయాల‌నుకున్నార‌ని.. ఇందుకోసం ప్ర‌కాశం బ్యారేజ్ గేట్ల‌ను బోట్ల‌తో ఢీకొట్టేలా కుట్ర పన్నార‌ని ఆరోపించారు. అన్ని ట‌న్నులున్న బోట్లు బ్యారేజ్ గోడ‌కు త‌గిలుంటే లక్ష‌లాది మంది ప్రాణాలు పోయేవని.. ఆ దారుణం గురించి త‌లుచుకుంటేనే ఒళ్లు గ‌గుర్పొడుస్తోందని అన్నారు. ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ర‌ఘురామ కృష్ణంరాజు ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను నిల‌దీసినందుకు ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కేసు పెట్టించార‌ని..మ‌రి ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాల‌ని చూసిన జ‌గ‌న్‌పై దేశ‌ద్రోహం కేసు ఎందుకు పెట్ట‌కూడ‌దు అని ప్రశ్నించారు. ఇప్ప‌టికే ఈ కుట్ర కేసులో భాగంగా పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు.