Vanga Madhusudhan Reddy: నాకు కూడా 100 కోట్లు ఇస్తే పార్టీ మారుతా

Vanga Madhusudhan Reddy says he would change the party if he was also given 100 crores

Vanga Madhusudhan Reddy: త‌న‌కు కాంగ్రెస్ పార్టీ రూ.100 కోట్లు ఇస్తే తాను కూడా పార్టీ మార‌తాన‌ని అన్నారు చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి. ఇటీవల వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన మరి కొందరు BJP కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంద‌ని మీడియా స‌మావేశంలో ఓ విలేకరి ప్రశ్న వేశారు. అందుకు చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధు సూదన్ రెడ్డి స్పందించి.. తనకు కూడా వంద కోట్లు ఇస్తే పార్టీ మారుతానంటూ సమాధానం ఇచ్చాడు. అయితే వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి వంద కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.