ఆరోజు మిమ్మ‌ల్ని తిట్టిన YSRCP నేత‌లంతా ఓడిపోయారు స‌ర్

vallabhaneni balasouri interesting talk with rajinikanth

Rajinikanth: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌ని మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి విమానాశ్ర‌యంలో క‌లిసారు. ఈరోజు జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారానికి రజినీకాంత్ కూడా హాజ‌ర‌య్యారు. అయితే ఆయ‌న ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో కూర్చుని ఉండ‌గా.. బాల‌శౌరి ఆయ‌న్ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా బాల‌శౌరి రజినీతో మాట్లాడిన అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌జినీ స‌ర్.. ఆరోజు మీరు విజ‌య‌వాడ వ‌చ్చిన‌ప్పుడు మీ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లంతా ఓడిపోయారు తెలుసా అని బాల‌శౌరి ర‌జినీతో అన్నారు. దానికి ర‌జినీ న‌వ్వి ఊరుకున్నారు.

గ‌తేడాది ర‌జినీకాంత్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చినప్పుడు నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు గురించి గొప్ప‌గా మాట్లాడారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ర‌జినీ గురించి నోటికొచ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేసారు. చీకేసిన మామిడికాయ టెంక‌లా ఉన్న ర‌జినీ ఎప్పుడు పోతాడో తెలీదు అంటూ కొడాలి నానితో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆ అంశం గురించి బాల‌శౌరి ర‌జినీతో ప్ర‌స్తావిస్తూ ఇప్పుడు వారంతా ఓడిపోయారు అని గుర్తుచేసారు.