Udayanidhi Stalin: సారీ చెప్ప‌ను గాక చెప్ప‌ను

స‌నాత‌న ధ‌ర్మంపై (sanathana dharma) తాను చేసిన కామెంట్ల‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ను గాక చెప్ప‌ను అని అంటున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ (udayanidhi stalin). ఈ దేశంలో స‌నాత‌న ధ‌ర్మం పేరిట కుల వివ‌క్ష ఉంద‌ని అయినా ఏమీ తెలీన‌ట్లు న‌టిస్తున్నార‌ని అన్నారు. స‌నాత‌న ధ‌ర్మం అనేది ఒక మ‌లేరియా, డెంగూలా దేశంలో వ్యాపిస్తోంద‌ని, దీనిని వ్య‌తిరేకించ‌డం కాకుండా పూర్తిగా నిర్మూలిస్తేనే దేశం బాగుప‌డుతుంద‌ని ఆయ‌న అన్న వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఉద‌య‌నిధికి ప్ల‌స్ సెక్యూరిటీని క‌ల్పించారు. ఆయ‌న నివాసం ద‌గ్గ‌ర కూడా భారీగా సెక్యూరిటీ ఏర్పాటుచేసారు. త‌న‌పై ఎలాంటి కేసులు పెట్టినా అందుకు సిద్ధ‌మే కానీ సారీ మాత్రం చెప్పేది లేద‌ని క‌రాకండిగా చెప్పారు ఉద‌య‌నిధి. (udayanidhi stalin)