TMC ఎమ్మెల్యే మిస్సింగ్

Kolkata: తృణ‌మూల్ కాంగ్రెస్(tmc) ఎమ్మెల్యే ముకుల్ రాయ్(mukul roy) అదృశ్య‌మ‌య్యారు. దాంతో ఆయ‌న కుమారుడు NSCBI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. నిన్న రాత్రి ముకుల్ దిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయ‌న దిల్లీకి రాలేద‌ని ముకుల్ కుమారుడు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఆయ‌న ఫోన్ కూడా రీచ్ అవ్వ‌ట్లేద‌ని తెలిపారు. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీతో ముకుల్‌కి 2017లో అభిప్రాయ‌బేధాలు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న బీజేపీ(bjp)లో చేరారు. నేష‌న‌ల్ వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసారు. ఆ త‌ర్వాత 2021లో బీజేపీ టికెట్‌పై వెస్ట్ బెంగాల్‌లో పోటీ చేసి గెలిచిన‌ ముకుల్.. కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌ళ్లీ తృణ‌మూల్‌లో(tmc) చేరారు.