Revanth Reddy: KCR త‌ద్దినం అంటూ షాకింగ్ కామెంట్స్

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR, మున్సిపల్ శాఖ మంత్రి KTR చచ్చిపోయారు అంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). వారికి సోమవారం రోజు తద్దినం పెట్టాలని పిలుపునిస్తున్నా అంటూ ఆయ‌న చేసిన కామెంట్స్ ర‌చ్చ‌కెక్కాయి. తెలంగాణ వ‌ర‌ద ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో కాంగ్రెస్ (congress) నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి (revanth reddy) రాక సందర్భంగా ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రేగా లాక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను.. పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేసారు. దాంతో ఇరు వ‌ర్గాల మధ్య దాడి జ‌రిగింది. ఫ్లెక్సీలు చింపుతుండగా వీడియోలు తీస్తున్న మీడియా రిపోర్టర్లపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడి చేసారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రోగ్రాంను మీడియా ప్ర‌తినిధులు బాయ్‌కాట్ చేసారు.