TPCC: కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేంత ద‌మ్ముందా?

TPCC నేత‌లు BRS నేత‌ల‌పై మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వంద గంట‌ల్లోనే ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేయాల‌ని చూస్తుంటే BRS నేత‌లు మాత్రం బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. TPCC సెక్ర‌ట‌రీ మ‌ధుసూద‌న్ రెడ్డి.. (madhusudan reddy) BRS నేత ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిపై (palla rajeshwar reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆరు నెల‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని ఆయ‌న అంటున్నార‌ని.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే ద‌మ్ము ఉందా అని స‌వాల్ విసిరారు.

“” మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అంటున్నారు. BJP, BRS నేత‌లు కుట్రలు పన్నుతున్నారు.. ప్రభుత్వం ఏర్పడి 100 గంటలు కాలేదు..కేంద్రంలో ఉన్నా BJP, BRS క‌లిసి ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రంలా BRS పని చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఫ్రీ బస్సు ,ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు చేసాం. పేదల రక్తం తాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల తీర్పును ఆగౌరవ పరుస్తున్నారు. మాకు ఇంకా 5 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది.

దళిత సబ్ ప్లాన్ అమలు చేయకపోతే దొరల బూట్లు నాకిన కడియం ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. వీరి దుర్మార్గాలను అడ్డుకోండి. తెలంగాణలో ప్రజలు కోరుకున్న కాంగ్రెస్ పాలన..ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 100 గంటల నుండి మా ప్రభుత్వం ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో పడిపోతుంది అంటున్నారు..నీకు అంత దమ్ముందా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి. మీ అక్రమ ఆస్తులు.. నీ ఫెక్ యూనివర్సిటీ బయటకు తీస్తాం. సీఎం రివ్యూ చేస్తుంటే జైలుకు వెళ్తామనే మీ నేతల్లో భయం పట్టుకుంది. రాష్ట్రంలో ప్రజా పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదు. 100 గంటల్లోనే 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసాం.. BRS అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు..“” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.