Mahua Moitra: ఈ చీర క‌ట్టుకున్నా.. నాపై ఫోక‌స్ పెట్టండి

Delhi: పార్ల‌మెంట్ ప్రొసీడింగ్స్‌ని ప్ర‌సారం చేసే ప‌బ్లిక్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ స‌న్స‌ద్ టీవీపై (sansad tv) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు తృణ‌మూల్ కాంగ్రెస్ నేత (tmc) మ‌హువా మోయిత్రా (mahua moitra). పార్ల‌మెంట్‌లో BJP కాకుండా మ‌రో పార్టీకి చెందిన ఎవరు మాట్లాడినా స‌న్స‌ద్ టీవీ వారిపై ఫోక‌స్ పెట్టడంలేద‌ని ఆమె ఆరోపించారు. BJP నేత‌లు ఎవ‌రు మాట్లాడినా కొన్ని నిమిషాల పాటు వారిపై ఫోక‌స్ ఉంటోంద‌ని అన్నారు. త‌న‌పై ఫోక‌స్ చేయాల‌న్న ఉద్దేశంతో మ‌హువా ఈరోజు పార్ల‌మెంట్‌కు బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ చీర క‌ట్టుకుని వ‌చ్చాన‌ని అన్నారు. “” సిగ్గులేని సన్స‌ద్ టీవీ వారు నాపై ఫోక‌స్ చేయాల‌నే ఇలా బ్రైట్ రంగుల చీర క‌ట్టుకుని వ‌చ్చాను. మీకు BJP నేత‌లు త‌ప్ప పార్ల‌మెంట్‌లో ఎవ్వ‌రూ క‌నిపించ‌రు క‌దా? సిగ్గుండాలి “” అంటూ స‌న్స‌ద్ టీవీపై మండిప‌డ్డారు.