Nara Lokesh: యువ‌గ‌ళం అయిపోలేదు.. YSRCP కౌంట్‌డౌన్ రోజు మ‌ళ్లీ క‌లుద్దాం

Nara Lokesh: యువ‌గ‌ళం (yuvagalam) పాదయాత్ర ఇంకా ఆగిపోలేద‌ని ఈ నెల 20న పోలిప‌ల్లిలో YSRCP ప్ర‌భుత్వం కౌంట్‌డౌన్ మొద‌లు కానుంద‌ని అన్నారు నారా లోకేష్. ఆయ‌న యువ‌గ‌ళం పాదయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏపీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ భావోద్వేగ ట్వీట్ చేసారు.

“” నేను యువ‌గ‌ళం పాద్రయాత్ర చేస్తానంటే కుటుంబాన్ని వ‌దిలేసి రోడ్ల‌పైకి వెళ్తున్నాడ‌ని అంద‌రూ విమ‌ర్శించారు. కానీ వారికి తెలీదు ఏపీలోని కోట్లాది కుటుంబాల‌కు చేరువ అవుతున్నాన‌ని. వారి ఆశీర్వాదాలు, ప్రేమాభిమానానే నాకు బ‌లాన్నిచ్చాయి. ఈ పాద‌యాత్ర నా అడుగుల గురించి కాదు ఏపీ ప్ర‌జ‌ల క‌న్నీరు గురించి. ఈ ప్ర‌యాణం ఏపీ ప్ర‌జ‌ల కోసం. నేను పాద‌యాత్ర పేరుతో మొద‌లుపెడితే అది యాత్ర నుంచి ఉద్య‌మంగా మారింది. నా ప్రియ‌మైన అక్క‌చెళ్లెళ్లు అన్న‌ద‌మ్ముల్లారా.. మ‌నం విజ‌యానికి చేరువ‌లో ఉన్నాం. ఈ పాద‌యాత్ర ఇంత‌టితో ముగియ‌లేదు. పోలిప‌ల్లిలో 20న YSRCP ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ మొద‌లుకాబోతోంది. పాద‌యాత్ర స‌మ‌యంలో నేను ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తాన‌ని మాటిస్తున్నాను “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు లోకేష్‌