EXCLUSIVE: ప్ర‌జాపాల‌న దర‌ఖాస్తులు.. ఎక్కువ‌గా ఆ ప‌థ‌కం కోస‌మే

EXCLUSIVE: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. కోటి 25 ల‌క్ష‌ల‌కు పైగా ద‌ర‌ఖాస్తుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌గా ఇప్ప‌టివ‌ర‌కు 20 ల‌క్ష‌ల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. వ‌చ్చిన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను పరిశీలిస్తే వాటిలో ఎక్కువ శాతం మ‌హిళ‌ల‌కు రూ.2500, ఇందిర‌మ్మ ఇళ్లు, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంట్‌, రూ.500 గ్యాస్ సిలిండ‌ర్లుకు సంబంధించిన‌వే ఎక్కువగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

అయితే ఇచ్చిన ఐదు గ్యారెంటీల‌కు సంబంధించినవి కాకుండా ఇత‌ర స‌మ‌స్య‌ల గురించి ద‌ర‌ఖాస్తుల్లో పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఐదు గ్యారెంటీలు లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌మ‌కు ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటిని ప‌రిష్క‌రిస్తే ఎంతో మేలు చేసిన‌వారు అవుతార‌ని ద‌ర‌ఖాస్తుల్లో ప్ర‌త్యేకంగా రాసి మ‌రీ స‌బ్మిట్ చేస్తున్నారు.