BRS: మహిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ కపటనీతి

మహిళా రిజ‌ర్వేష‌న్‌ బిల్లుకు (women’s reservation bill) కాంగ్రెస్‌కి (congress) చెందిన ముగ్గురు నేత‌లు ఓటు వేయ‌క‌పోవ‌డంపై మండిప‌డింది BRS. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటు వేయాల్సిన కీలక సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభ నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో మహిళా సాధికారతపై కాంగ్రెస్ పార్టీ కపటనీతి మరోసారి బయటపడిందంటూ BRS మండిప‌డింది.