KTR: రేవంత్ కుర్చీ లాగేయడం ఖాయం

telangana people will give befitting reply to revanth reddy says ktr

KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ఢిల్లీలో కాకుండా తెలంగాణ ప‌ల్లెల్లో పర్య‌ట‌న చేయాల‌ని ఛాలెంజ్ చేసారు BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల‌కు రుణ‌మాఫీ చేయ‌కుండా వారిని గాలికొదిలేసి మాటిమాటికీ ఢిల్లీ వెళ్తున్నార‌ని దాని వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లాభం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

“” సీఎం రేవంత్ కు దమ్ముంటే… “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి.. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..?? ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..?? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..?? ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు… గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..?? అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..??

అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా” ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం “” అని మండిప‌డ్డారు KTR.