Srinivas Goud: రాజ‌ధాని లేని రాష్ట్రం మా గురించి మాట్లాడుతోంది

Hyderabad: క‌నీసం రాజ‌ధాని లేని రాష్ట్రం తెలంగాణ గురించి మాట్లాడుతోంది అంటూ మండిప‌డ్డారు BRS మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud). తెలంగాణ‌లో TSPSC పేప‌ర్ లీకైన విష‌యం గురించి ఏపీ మంత్రి బొత్సా స‌త్యానారాయ‌ణ (botsa satyanarayana) మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ బాలేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. దేశంలో బెస్ట్ విద్యా వ్య‌వ‌స్థ క‌లిగిన రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని అన్నారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణ‌తో పోల్చి చూడ‌టం స‌రికాద‌ని, తెలంగాణ‌లో ఏదో ఒక కుంభ‌కోణం న‌డుస్తూనే ఉంటుంద‌ని విమ‌ర్శించారు. ఉపాధ్యాయుల‌ను బ‌దిలీ కూడా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉంద‌ని అన్నారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎక్క‌డ ఏపీ ఎక్క‌డ‌. క‌నీసం రాజ‌ధాని కూడా లేని రాష్ట్రం తెలంగాణ గురించి మాట్లాడుతుందా? అంటూ గట్టి కౌంట‌ర్ ఇచ్చారు.