Telangana: 6 గ్యారెంటీల‌పై పొంగులేటి షాకింగ్ కామెంట్స్

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఆరు గ్యారెంటీల‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇప్పటివ‌ర‌కు త‌మ‌కు అందిన ప్ర‌జా పాల‌న ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ఇంటింటికీ వెళ్లి క‌న్ఫామ్ చేసుకున్నాకే ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ఒక‌వేళ ఎవ‌రైనా త‌ప్పుడు ద‌ర‌ఖాస్తులు ఇచ్చిన‌ట్లు తెలిస్తే వారికి ప‌థ‌కాలు అంద‌వ‌ని.. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.