Telangana: మీ కాళ్లు మొక్కుతా సార్.. దయచేసి జీతాలు ఇవ్వండి

telangana employees touches duddilla sridhar babu feet for salary

Telangana: జీతాలు లేక ఇబ్బందులు ప‌డుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉద్యోగి వేద‌న ఇది. మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, గుడిపేట పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉద్యోగుల‌కు కొన్ని నెల‌లుగా జీతాలు లేవు. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్ట్ ప‌రిశీల‌న‌కు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబుని చూడ‌గానే ప్రాజెక్ట్ గేట్ ఆపరేటర్ లక్ష్మణ్ ఆయ‌న కాళ్ల‌పై పడి “మీ కాళ్లు మొక్కుతా సార్” జీతాలు ఇవ్వండి అంటూ క‌న్నీరుపెట్టుకున్నాడు. త్వ‌ర‌లో జీతాలు వ‌స్తాయ‌ని శ్రీధ‌ర్ బాబు ఆయ‌న్ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేసారు.