Lok Sabha Elections: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే.. మూడు స్థానాల్లో మార్పులు

Lok Sabha Elections:  2024లో జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) 17 స్థానాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో దాదాపు ప‌ది స్థానాల్లో ఎంపీల లిస్ట్ ఖ‌రారైన‌ట్లే అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం.

న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, మ‌ల్కాజ్‌గిరి స్థానాల్లో అభ్య‌ర్ధుల‌ను మార్చ‌నున్నారు. మ‌ల్కాజ్‌గిరి టికెట్‌పై చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌ల్కాజ్‌గిరి నుంచి మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. ఆ టికెట్‌ను మ‌ధూయాష్కీకి ఇస్తార‌ని తెలుస్తోంది. మ‌రోప‌క్క తెలంగాణ నుంచి సోనియా గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ పోటీ చేయించాల‌ని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ర‌చిస్తోంది.

దాదాపు ఖ‌రారైన సీట్లు

పెద్ద‌ప‌ల్లి – గ‌డ్డం వంశీ, చంద్ర‌శేఖ‌ర్

నిజామాబాద్ – అరికెల న‌ర్సారెడ్డి, ఇర‌వ‌త్రి అనిల్ కుమార్, మ‌హేష్ కుమార్ గౌడ్

వ‌రంగ‌ల్ – సిరిసిల్ల రాజయ్య‌, ఇందిర‌, అద్దంకి ద‌యాక‌ర్

మ‌హ‌బూబాబాద్ – బ‌ల‌రాం నాయ‌క్, నెహ్రూ

ఖ‌మ్మం – రేణుకా చౌద‌రి, పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి

మెద‌క్ – విజ‌య‌శాంతి

జ‌హీరాబాద్ – సురేష్ శెట్క‌ర్

న‌ల్గొండ – ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, జానా రెడ్డి

భువ‌న‌గిరి – చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్ – ఫిరోజ్ ఖాన్, మ‌స్క‌టి అలీ, అజ‌హ‌రుద్దీన్

ఆదిలాబాద్ – న‌రేష్ జాద‌వ్

క‌రీంన‌గ‌ర్ – క‌టకం మృత్యుంజ‌య‌, జీవ‌న్ రెడ్డి