Kavitha: కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే

మోసం కాంగ్రెస్ నైజం..కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే… కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు.. అని విమ‌ర్శించారు BRS ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (kavitha). 20 గంటల పాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్‌తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని కర్ణాటక మంత్రిలానే ఇక్కడ తెలంగాణ TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా 3 గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు ఇవ్వడం అనవసరమని అన్న‌ట్లు గుర్తుచేసారు. “” కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు ? 5 గంటల… 3 గంటల పార్టీలు మనకొద్దు… దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు‌ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి KCR గారికే మద్దతుగా నిలుద్దాం “” అని ట్వీట్ చేసారు క‌విత‌. (kalvakuntla kavitha)