Yuvagalam పాదయాత్రలో TDP, YCP కుమ్ములాట

నారా లోకేష్ చేప‌డుతున్న యువ‌గ‌ళం (yuvagala) పాద‌యాత్ర‌లో YCP, TDP వ‌ర్గాలు కొట్టుకున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు YCP జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా YCP అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో ప్రాంగణమంతా రసాభసా అయింది. మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ YCP అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.