TDP MLA KSNS Raju: ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు అన‌వ‌స‌రం.. ఆడ‌వాళ్లు వంట మానేస్తున్నారు

TDP MLA KSNS Raju shocking comments on schemes for women

TDP MLA KSNS Raju: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన‌వ‌స‌రంగా ఉచిత ప‌థ‌కాలు ఇస్తున్నార‌ని అన్నారు చోడ‌వ‌రం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. ఇదే విష‌యాన్ని తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాన‌ని తెలిపారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చిన ప‌థ‌కాల‌తో ఉప‌యోగ‌ప‌డేవాటికి ఖ‌ర్చు పెట్టుకోకుండా అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా దుస్తులు కొనేసుకోవ‌డం.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తెచ్చుకుంటాం క‌దా అని ఆడ‌వాళ్లు వంట‌లు మానేయ‌డం.. ఏటీఎం నుంచి డ‌బ్బులు డ్రా చేసుకుని మ‌ద్యం సేవించ‌డం వంటివి చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.