TDP: జ‌గ‌న్ నిరూపిస్తే అసెంబ్లీలో మొద‌టి బెంచ్‌లో కూర్చోపెడ‌తాం

tdp challenges jagan to prove sand mafia in tdp government

TDP: ఉచిత ఇసుక పేరుతో తెలుగు దేశం పార్టీ కొత్త నాట‌కం ఆడుతోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇసుక ఫ్రీ అని చెప్తూనే మ‌ళ్లీ డబ్బులు చెల్లించాల‌ని చెప్తున్నార‌ని అలా ఇప్ప‌టికే దాదాపు 40 ల‌క్ష‌ల ట‌న్నులు గ‌త 40 రోజుల్లో మాయం అయిన‌ట్లు ఆరోపించింది. దీనిపై తెలుగు దేశం పార్టీ స్పందిస్తూ.. తమ ప్ర‌భుత్వంలో ఉచిత ఇసుక విష‌యంలో ఒక్క రూపాయి తీసుకున్న‌ట్లు నిరూపిస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అసెంబ్లీలో మొద‌టి సీటులో కూర్చోపెడ‌తామ‌ని స‌వాల్ విసిరింది. జ‌గ‌న్ పార్టీ ఎంత విష ప్రచారం చేసినా, ఉచిత ఇసుక తీసుకునే ప్రజలకు తెలుసని, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు తెలుసని.. ఎంత తప్పుడు ప్రచారం చేస్తే, అంత వెద‌వ‌ అవుతావని మండిప‌డింది.

“” ఇసుక ఫ్రీ అనేది 2019 ముందే ఉన్న విధానం. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. లోడింగ్, రవాణా చార్జీలు భరించాలి.. అవి కూడా ఫ్రీ ఇవ్వాలంటే, ఎలాగూ తాడేపల్లి కొంపలో ఖాళీనేగా, వచ్చి లోడింగ్ చేస్తే ప్రజలకు లోడింగ్, రవాణా చార్జీలు కూడా ఉండవు.. ప్రజలకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది. ఒకసారి మీ ముఠా ఆలోచించండి “” అని తెలుగు దేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ సెటైర్ వేసింది.