SVSN Varma: రాష్ట్రంలోనే అత్య‌ధిక మెజారిటీతో ప‌వ‌న్ గెలుపు

svsn varma spoke with chandrababu naidu about pawan kalyan winning in pithapuram

SVSN Varma:  తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌.. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని క‌లిసారు. రెండు వారాల పాటు విదేశాల్లో ఉన్న చంద్ర‌బాబు నిన్ననే భార‌త్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఆయ‌న్ను క‌లిసి పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు గురించి చర్చించారు. రాష్ట్రంలోనే అత్య‌ధిక మెజారిటీతో ప‌వ‌న్ పిఠాపురంలో గెల‌వ‌బోతున్నార‌ని తాను చంద్ర‌బాబుకు తెలియ‌జేసిన‌ట్లు వ‌ర్మ తెలిపారు.