SVSN Varma: ప‌వ‌న్ అడుక్కుంటే సీటిచ్చాం.. నేనే సేనాధిప‌తిని

SVSN Varma: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (Pawan Kalyan) షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ  (Telugu Desam Party) నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌. తెలుగు దేశం పార్టీకి జ‌న‌సేన‌తో పొత్తు లేక‌పోయి ఉంటే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Assembly Elections) వ‌ర్మ పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేసేవారు.

అయితే ఇప్పుడు పిఠాపురం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎలాగైనా త‌న‌ను ల‌క్ష మెజారిటీతో పిఠాపురంలో గెలిపించాల‌ని ప‌వ‌న్ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో. పిఠాపురంలోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఆయ‌న బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు క‌ట్టి పెద్ద స్థాయిలో ప్ర‌చారం చేసేందుకు సిద్ధం అయ్యారు.

దీనిపై అక్కసు వెళ‌గ‌క్కుతున్నారు వ‌ర్మ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌ను అడుక్కుంటే పిఠాపురం సీటు ఇచ్చామ‌ని.. పిఠాపురంలో తెలుగు దేశం పార్టీ వ‌ల్లే ప‌వ‌న్ గెలుస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ మాత్రం దానికి జ‌న‌సేన ఫ్లెక్సీలు క‌ట్టి ఆర్భాటం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పిఠాపురంలో తానే సేనాధిప‌తిని అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసారు.

ALSO READ: Operation Pithapuram: ప‌వ‌న్ కోసం ఆరుగురిని దించిన జ‌గ‌న్