ఏపీ అసెంబ్లీలో వింత ఘ‌ట‌న‌..!

surprising act in ap assembly

AP Assembly: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌త ప్ర‌భుత్వం తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీ నేత‌ల‌పై ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టిందో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ్వేతప‌త్రం విడుద‌ల చేసారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రిపై కేసులు పెట్టారో వారంతా ఒక్క‌సారి నిల‌బ‌డాల‌ని చంద్ర‌బాబు పిలుపునివ్వ‌గా.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు స‌భ‌లోని స‌గానికి పైగా మంది నేత‌లు నిల‌బ‌డి న‌వ్వుకున్నారు. వారి గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. కేసులు పెట్టి బ‌య‌టికి రానివ్వ‌కుండా చేద్దాం అనుకున్నారు కానీ ప్ర‌జ‌లు గెలిపించి అసెంబ్లీకి పంపారు అని గ‌ర్వంగా చెప్ప‌డంతో స‌భ ద‌ద్ద‌రిల్లింది.