EXCLUSIVE: చంద్ర‌బాబు 13, జ‌గ‌న్ 1, ప‌వ‌న్ 0..!

EXCLUSIVE: ఆంధ్ర‌ప్రదేశ్ ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో బ‌రిలోకి దిగ‌నున్న నేత‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టేసారు. ఇప్ప‌టివర‌కు ఏ పార్టీ ఎన్ని ప్ర‌చార కార్య‌క్ర‌మాలు పెట్టిందో గ‌మ‌నిస్తే.. చంద్రబాబు 13, జగన్ మోహ‌న్ రెడ్డి  1, పవన్ క‌ళ్యాణ్‌  0. “రా క‌ద‌లిరా” అంటూ చంద్ర‌బాబు నాయుడు రోజుకో నియోజ‌క‌వ‌ర్గం చుట్టేస్తున్నారు. ఇక జ‌గ‌న్ “సిద్ధం” పేరుతో తొలి స‌భను ముగించారు. ఇక ప‌వ‌న్ “వారాహి యాత్ర” మొద‌లుకావాల్సి ఉంది. పవ‌న్ యాత్ర మొద‌లైతే అటు తెలుగు దేశం పార్టీకి కూడా కొంత మైలేజ్ వ‌స్తుందని భావిస్తున్నారు.

జగన్ “సిద్ధం” అనే ఒక్క మీటింగుతో క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని అందుకోవడంలో TDP బాగా వెనకబడిపోయిందనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు మాటలని వినడానికి, నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరా ? కష్టపడి జనసమీకరణ చేస్తున్నప్పటికీ ఎందుకో అనుకున్నంత ఉత్సాహం అయితే TDPలో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.