Siddaramaiah: పెద్దాయ‌న చేతిలో ప‌రువు పాయే…!

Bengaluru: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధారామ‌య్య (siddaramaiah) ప‌రువుపోయింది. ఓ సీనియ‌ర్ సిటిజ‌న్ ఆయ‌న కారును ఆపి మ‌రీ నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీఎం అయిన‌ప్ప‌టికీ సిద్ధారామ‌య్య ఇంకా అధికారిక భ‌వ‌నంలో నివ‌సించ‌డంలేదు. ఆయ‌న సొంతింట్లోనే ఉంటున్నారు. సిద్ధారామ‌య్య ఉంటున్న ఇంటి ముందే ఓ సీనియ‌ర్ సిటిజ‌న్ నివ‌సిస్తున్నారు.

అయితే సిద్ధూ ఇంటికి వ‌చ్చే చుట్టాలు, అధికారులు త‌మ వాహ‌నాల‌ను ఆ పెద్దాయ‌న ఇంటి ముందు పెడుతున్నార‌ట‌. దాంతో పార్కింగ్ విష‌యంలో చాలా ఇబ్బంది అయిపోయింది. సీఎం కాబట్టి మౌనంగా ఉండిపోయారు కానీ ఈరోజు ఆయ‌న‌కు కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. సిద్ధూ కారు వ‌స్తుంటే అడ్డంగా ఆపి మ‌రీ ఇదెక్క‌డి నాన్‌సెన్స్ అని నిల‌దీసారు. దాంతో త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా సెక్యూరిటీని ఆదేశించారు. ఆగ‌స్ట్‌లో సిద్ధూ త‌న అధికారిక నివాసంలోకి వెళ్ల‌నున్నారు. (siddaramaiah)