Tirumala Laddoo: ల‌డ్డు తిని ఎవ్వ‌రూ చావ‌లేదుగా.. స‌మ‌స్యేంటి?

seeman comments on tirumala laddoo

Tirumala Laddoo: తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడుతున్నార‌న్న అంశం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌తి రాష్ట్రానికి చెందిన రాజ‌కీయ నాయకులు ఈ అంశంపై త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ద‌ర్యాప్తు చేసి తిరుమ‌ల ప్ర‌తిష్ఠ‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. అయితే.. త‌మిళ‌నాడుకి చెందిన నామ్ త‌మిళ‌ర్ క‌ట్చి అనే పార్టీకి చెందిన సీమ‌న్ అనే ఓఆర్డినేట‌ర్ తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంపై త‌ప్పుడు కూత‌లు కూసారు. దీనిని జాతీయ స్థాయి వివాదంగా మారాల్సిన అవ‌సరం ఏముంది? ల‌డ్డూ తిన్న‌వారు ఎవ్వ‌రూ చ‌నిపోలేదుగా. మ‌రి స‌మ‌స్యేంటి అని ఆయ‌న వ్యాఖ్య‌లు చేసారు. క‌ల్తీ నెయ్యి ఎవ‌రు అమ్మారో తెలుసుకుని వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్ట‌డమో లేక వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మో చేస్తే అయిపోయేదానికి ఇంత రాద్దాంతం అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు.