Satya Kumar Yadav: అందుకే మీరు మీ భూబ‌కాసుర దోస్త్ జ‌గ‌న్ ఓడిపోయారు

Satya Kumar Yadav rips into brs ktr

Satya Kumar Yadav:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంద‌ని చెప్పారు కేసీఆర్, కేటీఆర్. త‌మ‌కు జ‌గ‌నే గెలుస్తార‌ని స‌మాచారం ఉంద‌ని ఎన్నోసార్లు చెప్పారు. తీరా చూస్తే జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండాపోయారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. అన్ని ప‌థ‌కాలు ఇచ్చిన జ‌గ‌న్‌కు 40 శాతం ఓట్లేంటి? రోజూ గుడ్ మార్నింగ్ ధ‌ర్మ‌వ‌రం పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ఓడిపోవ‌డం ఏంటి? అన్నారు.

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ధ‌ర్మ‌వ‌రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత స‌త్య కుమార్ యాద‌వ్ స్పందిస్తూ నిప్పులు చెరిగారు. “” ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు.

గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవ‌త్స‌రాల‌ క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి “” అని సెటైర్ వేసారు.