Telangana Assembly: KCR కాలిగోటికొస్తార్రా మీరు.. అసెంబ్లీలో నువ్వా నేనా అనుకున్న జ‌గ‌దీష్ రెడ్డి వెంక‌ట్‌ రెడ్డి

ruckus in Telangana Assembly between jagadish reddy and revanth reddy

Telangana Assembly:  తెలంగాణ అసెంబ్లీ స‌మావేశం ఈరోజు ర‌సాభాస‌గా సాగింది. భార‌త రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి.. కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నువ్వా నేనా అనే విధంగా ఒక‌రిపై ఒక‌రు కేక‌లు వేసుకున్నారు. KCR గురించి త‌న గురించి వెంక‌ట్ రెడ్డి త‌ప్పుగా మాట్లాడారంటూ జ‌గ‌దీష్ రెడ్డి రెచ్చిపోయారు.

కేసీఆర్ గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? ఆయ‌న కాలిగోటికి మీరెవ్వ‌రూ స‌రిపోరు అని జ‌గదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ నేత‌లు సారీ చెప్పాలంటూ లేచి ఆందోళ‌న చేసారు. దాంతో స‌బ్జెక్ట్‌పై మాత్ర‌మే మాట్లాడాల‌ని స్పీక‌ర్ జ‌గ‌దీష్‌కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ గురించి త‌న గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గిస్తేనే తాను మాట్లాడ‌తాన‌ని జ‌గ‌దీష్ అన్నారు. కాసేప‌టికి స‌భ ప్రశాంతంగా మారగా.. ఆ త‌ర్వాత జ‌గ‌దీష్ రెడ్డి విద్యుత్ అంశం గురించి వారించారు.