Roja vs Peddi Reddy: జ‌గ‌న్‌ను బెదిరించి రోజా టికెట్ తీసుకున్నారా?

roja turns rebel against peddi reddy

Roja vs Peddi Reddy:  న‌గ‌రి టికెట్‌ను రోజా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని బెదిరించి మ‌రీ తీసుకున్నారా? ఈ మాట ఎవ‌రో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి వ‌ర్గాలు అంటున్నాయి. కొంత‌కాలంగా రోజాకు పెద్ది రెడ్డి మ‌ధ్య విభేదాలు ఉన్నాయి. న‌గ‌రిలోని దాదాపు ఐదు మండ‌లాల్లో రోజాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్ద‌ని ధ‌ర్నాల‌కు కూడా దిగారు. అయినా జ‌గ‌న్ ఆమెకు టికెట్ ఇవ్వడంతో అంతా షాకయ్యారు. జ‌గ‌న్ రోజాకు టికెట్ ఇవ్వ‌కూడ‌దు అనుకున్నారు కానీ జ‌గ‌న్‌ను బెదిరించి మ‌రీ ఆమె టికెట్ తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

త‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ‌డ‌మాట‌పేట ఎంపీటీసీ ముర‌ళీ రెడ్డిపై రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అత‌న్ని స‌స్పెండ్ చేయించిన‌ట్లు తెలుస్తోంది. మిగిలిన నాలుగు మండ‌లాల్లోని అస‌మ్మ‌తి నేత‌ల‌ను కూడా రోజా భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌ట‌. ముర‌ళీ రెడ్డి సస్పెన్ష‌న్‌తో న‌గిరిలో వ‌ర్గ పోరు మ‌రింత ముదిరింది.

అన్ని వార్త‌ల‌ను చూసేందుకు https://telugu.newsx.com/ అని టైప్ చేయండి