RK Roja: ప‌వ‌న్ బాప్టిజం తీసుకున్నారు

rk roja says pawan kalyan took baptism

RK Roja: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా. మ‌ధురై మీనాక్షి ఆల‌యంలో ఈరోజు రోజా పూజ‌లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత అక్క‌డి మీడియా వ‌ర్గాల‌తో తిరుమ‌ల వివాదం గురించి స్పందించారు. చంద్ర‌బాబు నాయుడికి దేవుడంటే భ‌క్తి, భ‌యం లేవ‌ని.. అందుకే పూజ చేసేట‌ప్పుడు బూట్లు వేసుకుంటాడ‌ని అన్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య, పిల్ల‌లు క్రిస్టియ‌న్ల‌ని.. అందుకే ప‌వ‌న్ కూడా బాప్టిజం తీసుకున్నార‌ని.. ఇక ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు అస‌లు దేవుడే లేడు దేవుడ‌నే వాడు అబ‌ద్ధం అన్నాడ‌ని ఇలాంటివారు ఈరోజు స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడుతుంటే న‌వ్వొస్తోంద‌ని అన్నారు. తిరుమ‌ల అంశంపై త‌మ‌కు సీబీఐ ఎంక్వైరీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు.