RK Roja: ప్ర‌జ‌ల‌కు మంచి చేసా.. జ‌గ‌న్ అన్న‌తోనే నా ప్ర‌యాణం

rk roja reacts on mopidevi venkataramana leaving ysrcp

RK Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఆర్కే రోజా చాలా కాలం త‌ర్వాత ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత నిన్న తొలిసారి న‌గ‌రిలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో రోజా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మంచి చేసినా ఎందుకు ఓడిపోయిందో అంద‌రికీ తెలుస‌ని.. త్వ‌ర‌లో నిజానిజాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని అన్నారు. న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ చేసాన‌న్న సంతృప్తి త‌న‌కు ఉంద‌ని అన్నారు.

ఈరోజు రోజా ఓ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవ‌డానికి వెళ్లి గుడ్ల‌వ‌ల్లేరు హాస్ట‌ల్ ఘ‌ట‌న గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆడ‌పిల్లల ప‌ట్ల జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను చూసి కూట‌మి ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల‌వంచుకోవాల‌ని అన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆడ‌పిల్ల‌కు అన్యాయం జ‌రిగితే 24 గంట‌ల్లో నిందితుడిని అదుపులోకి తీసుకునేవార‌ని.. కానీ మచ్చుమ‌ర్రి ఘ‌ట‌న‌లో 9వ త‌ర‌గ‌తి బాలికపై అత్యాచారం చేసి చంపేస్తే 90 రోజులు అవుతున్న ఇంకా శ‌వం కూడా దొర‌క్క‌పోవ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం రెడ్ బుక్‌ను ప‌క్క‌న పెట్టి ఆడ‌పిల్లల రక్ష‌ణ కోసం ప‌నిచేయాల‌ని.. ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని తెలిపారు.

రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం గురించి మాట్లాడుతూ.. పార్టీ నుంచి ఎవ‌రు వెళ్లిపోయినా జ‌గ‌న్‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని.. అలా పార్టీని వ‌దిలి వెళ్లేవారిని ఎవ్వరూ క్ష‌మించ‌రు.. గౌర‌వించ‌ర‌ని అన్నారు.