Revanth Reddy: ఈ నెల 11న వైజాగ్‌కు సీఎం..!

Revanth Reddy: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 11న వైజాగ్ వెళ్ల‌నున్నారు. ఆరోజున జ‌రిగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక సభలో పాల్గొన‌నున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కూడా త‌మ స‌త్తా చాటాల‌ని అనుకుంటున్నారు. ఇందుకోసం వైఎస్ ష‌ర్మిళ‌ను (YS Sharmila) APCC అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టించి జోరుగా ప్ర‌చారం చేయిస్తున్నారు. అప్పుడ‌ప్పుడ రేవంత్ రెడ్డి కూడా ష‌ర్మిళ‌కు సాయం చేస్తున్నారు.