Revanth Reddy: కాంగ్రెస్ వ‌ల్లే స్వాతంత్ర్యం వ‌చ్చింద‌ట‌

Hyderabad: కాంగ్రెస్ నేత‌, TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) ఎప్పుడు ఏం మాట్లాడినా వైర‌ల్ అయిపోతూ ఉంటుంది. రాజ‌కీయాంగా ఆయ‌న చేసే కామెంట్స్ గురించి పెద్ద‌గా పట్టించుకోక‌పోయినా స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) లాంటి పర్వ‌దినాల విష‌యంలో మాట్లాడే ముందు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆయ‌న మ‌ల్కాజ్‌గిరిలో జెండా వంద‌నం చేయ‌డానికి వ‌చ్చి.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావ‌డానికి కాంగ్రెస్ ఎంతో క‌ష్ట‌ప‌డింద‌ని, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేస్తే స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామ‌ని అన్నారు. (revanth reddy)