Revanth Reddy: KCR ఏమిచ్చినా తీసుకోండి

Revanth Reddy: రైతు బంధు డ‌బ్బులు అందాయ‌ని అప్పుడే సంతోష‌ప‌డొద్దు.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఇంకో ఐదు వేలు అద‌నంగా రైతు బంధు అందుతుంద‌ని అంటున్నారు రేవంత్ రెడ్డి. రైతు బంధుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు BRS, BJP పార్టీల దోస్తీ మ‌రోసారి రుజువైంద‌ని అన్నారు.

ప్ర‌స్తుతానికి KCR ఏమిచ్చినా తీసుకోవాల‌ని ఆ త‌ర్వాత తాము అధికారంలోకి వ‌స్తే అద‌నంగా అన్నీ ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఏకే గోయ‌ల్ ఇంట్లో రూ.300 కోట్ల అక్ర‌మ న‌గ‌దు ఉన్నా కూడా ఆయ‌న ఇంటిపై ఎలాంటి దాడులు చేయ‌లేద‌ని BRS, BJP నుంచి ఎవ‌రైనా కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపై మాత్ర‌మే రైడ్లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. గ‌డ్డం వివేక్ BJPలో ఉన్న‌ప్పుడు రాముడికే ప‌ర్యాయ‌ప‌దంగా చూపించేవారని ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్‌లోకి రాగానే ఐటీ దాడులు చేయించి అక్ర‌మంగా న‌గ‌దు త‌ర‌లిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.