నా ఇంటి ముందు బిచ్చమెత్తుకున్న రోజులు మ‌ర్చిపోయావా హ‌రీష్ రావ్?

revanth reddy says harish rao built farm house because of congress

Revanth Reddy: BRS నేత హ‌రీష్ రావు త‌న ఇంటి ముందు చేతులు క‌ట్టుకుని బిచ్చమెత్తుకున్న రోజులు మ‌ర్చిపోయిన‌ట్లున్నాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు త‌మ‌ కాంగ్రెస్ వాళ్లు దయ తలిచి హవాయి చెప్పులున్న ఆయ‌న్ను మంత్రిని చేస్తే ఇవ్వాళ ఆయ‌న‌ అజీజ్ న‌గ‌ర్లో ఫాంహౌస్ వచ్చిందని అన్నారు. ఛార్మినార్‌లో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో రేవంత్ మాట్లాడుతూ హ‌రీష్ రావుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు.

“” నువ్వేందిరా హ‌రీష్ న‌న్ను అనేది. చెప్పులు మోసే నువ్వెంత నీ బ‌తుకెంత‌. మ‌ర్చిపోయావా నా ఇంటి ముందు చేతులు క‌ట్టుకుని బిచ్చం అడుక్కున్న రోజులు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ద‌య త‌లిస్తేనే క‌దా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నావ్. ఆ త‌ర్వాత అజీజ్ న‌గ‌ర్‌లో ఫాం హౌస్ క‌ట్టించుకున్నావ్. మాట్లాడితే మూసీకి రా చూసుకుందాం అంటున్నావ్. నేను ఇప్పుడు ఛార్మినార్‌లో ఉన్నా. ప‌క్క‌నే మూసీ. రా చూసుకుందాం. ప‌నిలో ప‌ని నీ ఫాం హౌజ్‌కి కూడా పోదాం. BRS నేత‌లు ఆరోపిస్తున్నట్లు హైడ్రా వ‌ల్ల ఏ పేద‌వాళ్లూ బ‌య‌టికి వ‌చ్చి కేక‌లు వేయ‌డం లేదు.

దోపిడీల‌కు పాల్ప‌డిన‌వారే ర‌చ్చ చేస్తున్నారు. పేద‌వారి ఇళ్ల‌కు నేను అండ‌గా ఉంటా. కానీ బ‌డా బాబుల‌ను మాత్రం వ‌దిలేది లేదు. వారిపై హైడ్రా ఒక అంకుశంలా ప‌నిచేస్తుంది. ఇండ్లు కూల్చడానికి బుల్డోజర్‌ను పంపిస్తా.. KTR, హరీష్ రావు వచ్చి ముందు పడుకోండి. తొక్కుకుంటూ పోతది. చెరువులు, ప్రభుత్వ జాగాలు కబ్జా చేసిన వారి పట్ల హైడ్రా అంకుశం. పేదలు , మధ్యతరగతి ప్రజల ఆస్తులకు నేను హామీ ఇస్తున్నా. వేలు, లక్షల కోట్లు దోచుకున్నవారిని మాత్రం వదిలేది లేదు “” అని రెచ్చిపోయారు.