Revanth Reddy: రెడ్ల‌కు 10 ఎకరాల భూమి ఉండాలి

Hyderabad: రెడ్డి (reddy) కులానికి చెందిన ప్ర‌తి ఒక్క‌రికి 10 ఎక‌రాల భూమి ఉండాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). నిన్న గాంధీ భ‌వ‌న్‌లో ఏర్పాటుచేసిన స‌మావేశంలో రేవంత్ పాల్గొన్నారు. 10 ఎక‌రాల భూమి చేతిలో ఉంటేనే రెడ్ల చేతుల్లో రాజ్యం రాజకీయం ఉంటుంది అంటూ వివాదాస్ప‌దంగా మాట్లాడారు. ఆయ‌న రెడ్డి కులానికి చెందినంత మాత్రాన కేవ‌లం అదే కులానికి చెందిన‌వారి కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత క‌రెక్టో ఆయ‌న‌కే తెలియాలి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రేవంత్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఓట్ల చీలిక‌ల‌కు పాల్ప‌డుతున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీలు పెట్టండి.. అప్పుడు మీ పార్టీలు ఎట్ల గెలవవో మేము చూస్తాం అంటూ రేవంత్ (revanth reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇత‌ర కులాల వారు మండిప‌డుతున్నారు.