KTR: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేస్తున్నాడు

revanth reddy is fooling rahul gandhi says ktr

KTR: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీనే మోసం చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ రైతుల‌ను మోసం చేయ‌డ‌మే కాకుండా లోన్ విష‌యంలోనూ కుట్ర‌లు చేస్తోంద‌ని అన్నారు. డిసెంబ‌ర్‌లో అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల మేర రుణ మాఫీ చేస్తామ‌ని అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చారని ఆ త‌ర్వాత ఆగ‌స్ట్ 15కి వాయిదా వేసార‌ని అన్నారు. 17,900 కోట్ల మేర రుణ మాఫీ చేసాం అంటున్నార‌ని కానీ కేవ‌లం 17,900 కోట్లు మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని మ‌రి మిగ‌తా రూ.49,000 కోట్లు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. మిగ‌తా మొత్తం మ్యాజిక్‌గా మాయ‌మైపోయిందా అని రాహుల్‌ను ప్ర‌శ్నించారు.