Revanth Reddy: ఛ‌త్తీస్‌గ‌డ్ విద్యుత్ ఒప్పందంపై ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం

Revanth Reddy: తెలంగాణ విద్యుత్ విష‌యంలో మూడు అంశాల‌పై సీఎం రేవంత్ రెడ్డి జ్యుడిషియ‌ల్ ఎంక్వైరీ వేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ ఈ వ్యాఖ్య‌ల‌ను చేసారు. తెలంగాణ ఛ‌త్తీస్‌గ‌డ్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై విచారణ చేపట్టాల‌ని ఈ ఒప్పందం న‌ష్టం అని చెప్పిన ఉద్యోగిని గ‌త ప్ర‌భుత్వం వేధింపుల‌కు గురిచేసిందని రేవంత్ అన్నారు.