Renuka Chowdhury: ఖ‌మ్మం టికెట్ ఇవ్వాల్సిందే

Hyderabad: కాంగ్రెస్ (congress) పార్టీలో మాజీ BRS నేత‌ల చేరిక‌ల‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయ్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేర‌నున్న నేప‌థ్యంలో.. ఆ పార్టీ ఎంపీ రేణుక చౌద‌రి (renuka chowdhury) పావులు క‌దుపుతున్నారు. పొంగులేటి, రేణుక‌ల నియోజ‌క‌వ‌ర్గం ఖ‌మ్మం. దాంతో పొంగులేటిని చేర్చుకునేందుకు ఎక్క‌డ కాంగ్రెస్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేస్తుందోన‌ని ముందుగానే ప్లాన్లు వేసుకుంది. ఇదే విష‌యం గురించి హై క‌మాండ్‌తో కూడా చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. తన అనుచరులతో క‌లిసి ఢిల్లీలో సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేణుక భేటీ అయ్యారు. ఇక పొంగులేటి దీని గురించి ఏమంటారో చూడాలి.