Congress: BJPని త‌రిమికొడితేనే గాంధీజీకి అస‌లైన నివాళి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో BJPని దేశం నుంచి వెళ్ల‌గొడితేనే గాంధీజీకి అస‌లైన నివాళి ద‌క్కిన‌ట్లు అని అన్నారు కాంగ్రెస్ (congress) చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (mallikarjun kharge). 2024 నాటికి మ‌హాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు అయ్యి 100 ఏళ్లు పూర్త‌వుతాయ‌ని ఖ‌ర్గే అన్నారు. 2024లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) BJPని తొక్కిప‌డేస్తే… అదే గాంధీజీకి అస‌లైన నివాళి అని తెలిపారు. ఈరోజు రేపు తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (cwc meeting) స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రెండు రోజుల పాటు కాంగ్రెస్ హైక‌మాండ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేల‌తో పాటు ఇత‌ర ముఖ్య సభ్యులు కూడా తెలంగాణ‌లో స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు.