Malla Reddy: ఏ పార్టీ నుంచి ఎవ‌రు ఉండాలో నేనే డిసైడ్ చేస్తా

Hyderabad: మేడ్చల్ అసెంబ్లీ సీటుకు సంబంధించి ఏ పార్టీ నుంచి ఎవ‌రు ఉండాలో నేనే డిసైడ్ చేస్తా అని అంటున్నారు BRS నేత మ‌ల్లారెడ్డి (malla reddy). కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థిగా ఉండాలో చెప్తాన‌ని తెలిపారు. 2018లో KLRకు టికెట్ ఇప్పించింది తానేన‌ని కాంగ్రెస్ (congress) అధిష్టానంలో త‌న‌కు దోస్తులు ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డిపై (revanth reddy) తొడకొట్టిన తర్వాత త‌న‌ గ్రాఫ్ పెరిగిందని త్వరలోనే మీడియా సంస్థ ఏర్పాటుచేసే ఆలోచ‌న‌లు కూడా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ యాసలో ఏడాదికి 4 సినిమాలు తీస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు మ‌ల్లారెడ్డి.