Rayapati Aruna: ప‌వ‌న్ CM అవ్వాల‌నే మేం త‌పిస్తున్నాం

AP: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అవ్వాల‌మే తాము తపిస్తున్నామ‌ని అంటున్నారు జ‌న‌సేన నేత రాయ‌పాటి అరుణ (rayapati aruna). YCP నేత పేర్ని నాని (perni nani).. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడుతూ రెండు చెప్పులు చూపించిన తీరుపై అరుణ స్పందించారు.

“పేర్ని నాని జ‌గ‌న్‌కు పాలేరు కుక్క‌. నాని ప‌వ‌న్‌కి చెప్పులు చూపించ‌డం కాదు. నేను నానికి చూపిస్తాను చెప్పు. అప్పుడే అత‌నికి బుద్ధి వ‌స్తుంది. ప‌వ‌న్ స‌మావేశాల్లో ఎక్క‌డ మాట్లాడినా సొల్లు మాట‌లు అంటున్నారు. సొల్లు మాటలంటే.. అమ‌రావ‌తి రాజ‌ధాని అని చెప్పి వేల‌కు వేల ఎక‌రాలు లాక్కుని ఇప్పుడు మాట మార్చేసిన జ‌గ‌న్‌వి సొల్లు మాట‌లు. ఇక‌పోతే వారాహి యాత్ర అనేది నియోజ‌క‌వ‌ర్గాల్లో మా బ‌లం ఎంత‌? మేం అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేయాల‌నుకుంటున్నాం అని తెలియ‌జేయ‌డానికి మాత్రమే చేస్తున్న యాత్ర‌. నేను కానీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నేత‌లు కానీ క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేది ప‌వ‌న్‌ను సీఎం చేయ‌డానికే. ప‌వ‌న్ సీఎం అవ్వాల‌నే మేమూ కోరుకుంటున్నాం. కానీ ప‌వ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధి కోస‌మే కాబ‌ట్టి ఆయ‌న నిర్ణ‌యాల‌కు మేం క‌ట్టుబ‌డి ఉంటాం. ఇక ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తాం అనేది వారాహి యాత్ర అయ్యాక ఓ క్లారిటీ వ‌స్తుంది” అని తెలిపారు అరుణ‌.