Parliament Attack: ర‌చ్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో సలార్ రేంజ్‌లో రాహుల్ గాంధీ బిల్డ‌ప్

Parliament Attack: ఈరోజు పార్ల‌మెంట్‌లో లోక్ స‌భ స‌మావేశాలు జ‌రుగుతుంటే ఇద్ద‌రు ఆగంతకులు ఉన్న‌ట్టుండి రంగులు చ‌ల్లుతూ ర‌చ్చ రచ్చ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారిద్ద‌రూ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ ఇద్ద‌రూ ర‌చ్చ చేయ‌డం మొద‌లుపెట్టారో వారి ద‌గ్గ‌ర మార‌ణాయుధాలు ఉన్నాయేమో.. దాడి చేస్తారేమో అని పార్ల‌మెంట్‌లోని ఎంపీలంతా భ‌యాందోళ‌న‌ల‌తో ప‌రుగులు పెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) మాత్రం బెద‌ర‌కుండా ఉన్న‌చోటే నిల‌బడి వారిని క‌ట్ట‌డి చేయాల‌నుకున్నారట‌. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ జాతీయ ప్ర‌జా ప్ర‌తినిధి సుప్రియా శ్రీనాథే వెల్ల‌డిస్తూ రాహుల్ ఫోటోను షేర్ చేసారు. భ‌య‌ప‌డొద్దు అని చెప్ప‌డ‌మే కాదు భ‌య‌ప‌డ‌కుండా నిల‌బ‌డి చూపిస్తారు కూడా అంటూ స‌లార్ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ ఆమె పోస్ట్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.