Rahul Gandhi: మోదీకి సిగ్గులేదు

Delhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) సిగ్గులేదంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాహుల్ గాంధీ (rahul gandhi). అపోజిష‌న్ కూట‌మి ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion) ప‌రీక్ష‌లో బీజేపీ గెలిచింది. నిన్న పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోదీ మ‌ణిపూర్ ఘ‌ట‌న (manipur violence) గురించి మాట్లాడుతూ త్వ‌ర‌లో అక్క‌డ శాంతి భ‌ద్ర‌త‌లు నెల‌కొంటాయ‌ని హామీ ఇచ్చారు. అయితే మ‌ణిపూర్ గురించి మాట్లాడుతున్న క్ర‌మంలో మోదీ న‌వ్వుతూ మాట్లాడార‌ని, అది సిగ్గుచేటు అని రాహుల్ ఆరోపించారు.

“” నిన్న ప్రధాని పార్లమెంట్‌లో 2 గంట‌ల 13 నిమిషాల పాటు మాట్లాడారు. చివ‌రి రెండు నిమిషాల్లో మ‌ణిపూర్ గురించి మాట్లాడారు. ఎన్నో నెల‌లుగా మ‌ణిపూర్ మంటల్లో కాలిపోతోంది. హ‌త్య‌లు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయ్. కానీ మోదీ మాత్రం న‌వ్వుతున్నారు. అందుకు ఆయ‌న‌కు సిగ్గుండాలి. అలా ఆయ‌న‌కు సూట్ అవ్వ‌దు “” అంటూ మండిప‌డ్డారు రాహుల్.